మన పోలీసులు పనితీరు ప్రస్తుత కాలంలో ప్రశంసించదగినదే. అయితే అప్పుడప్పుడే మాత్రం వారు అసలు కన్నా కొసరుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వినబడుతున్న తరుణంలో ఈ ఘటన వారిని మరోమారు వార్తల్లో నిలిచేలా చేసింది, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మన పోలీసులు పనితీరుపై ఈ కేసులో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వస్తువు దొంగలించబడిందని ఓ సెలబ్రిటీ పిర్యాదు ఇవ్వడంతో.. ఆ కేసు దర్యాప్తు కోసం నలుగురు క్రైం టీమ్ కానిస్టేబుళ్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయింది మరీ పంపారు. ఒక్కటి, రెండు, మూడు అని లెక్కబెట్టకుండానే కేవలం 72 గంటల వ్యవధిలో కేసును చేధించారు పోలీసులు. అయితే ప్రశంసించాలి తప్ప వ్యంగాస్త్రాలు ఎందకంటారా..?
వివరాల్లోకి వెళ్తే.. దిల్షుక్నగర్లో నివసించే జగదీష్ అనే వ్యక్తి ఆక్యుపంక్షర్ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఫిలింనగర్లో నివసించే సినీ నటి రాధా ప్రశాంతికి పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి జగదీష్ ఆమెతో ఫోన్లో అందుబాటులో లేకుండా పోయాడు. అయితే తన ఇంట్లో పెన్డ్రైవ్ చోరీకి గురైందని అది జగదీష్ చోరీ చేశాడంటూ ఆమె మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జగదీష్ కోసం గాలింపు చేపట్టారు.
అధికారుల అదేశాలతో మూడు రోజులు అతని ఇంటి వద్ద మాటువేసిన పోలీసులు.. రేయింబవళ్లు అతడి కోసం వెతికేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తీరా జగదీష్ను విచారిస్తే ఆ పెన్డ్రైవ్ తాను తీయలేదని తెలిపాడు. పెన్డ్రైవ్ పోయిందని సినీనటి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు చేసి హడావుడికి అవాక్కయ్యారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయిదు ఖరీదైన కార్లు చోరీకి గురయ్యాయి. ఇందులో ఫార్చునర్లాంటి ఖరీదైన కారు కూడా ఉంది. వీటి కోసం గాలించాల్సిన పోలీసులు ఓ పెన్డ్రైవ్ దొంగ కోసం మూడు రోజులుగా వేట సాగించారని తెలిసి.. జనం ముక్కున వేలేసుకున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more