మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చకైనా లేడు చూడు.. మానవత్వం వున్నవాడు అంటూ ఓ తెలంగాణ కవి రాసిన కవిత అక్షరాల నిజమైంది. సాంకేతిక విప్లవం అందుబాటులోకి రాగానే ఏం జరిగినా పెల్సీలు, వీడియో రికార్డులకు మాత్రమే యువత, పెద్ద, ముసలి ముతక అందరూ అదే దారిలో ప్రయాణిస్తున్నారు. సాంకేతిక విప్లవాన్ని పునికిపుచ్చుకుని తమ ఫలానా చోట ఫలాన ప్రమాదం జరిగింది.. వారికి సాయం చేయాలంటూ స్పందించే మనుషులు కరువయ్యారు.
తమ కళ్ల ఎదుటే ముగ్గురు వ్యక్తులు రక్తమోడుతూ చావుబతుకుల మధ్య కోట్టుమిట్టాడుతున్న పట్టించుకోని ఈ మనుషుల మద్య మనుషిగా తిరగడానికే మనిషన్నవాడికి సిగ్గుపడుతున్నాడు. అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజంగా నిజం. సాంకేతికత తమ కళ్లకు పోరలను కమ్మెస్తూ తమ కళ్ల ఎదుట మనుషులు జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతున్నా.. క్షతగాత్రులు సాయం చేయండమ్మ, సాయం చేయండి బాబు అంటూ ఆర్థించి, వేడుకున్నా వారిలో కనీసం కనికరం లేకుండా పోతే వారినేం అనాలి. మనుషులనేనా..?
రోడ్డు ప్రమాదంలో గాయపడి ‘సాయంచేయండి బాబూ’ అని అర్థిస్తున్నా.. అక్కడున్న వారు ముందుకురాలేదు. పైగా ఫొటోలతో కాలక్షేపం చేశారు. దీంతో క్షతగాత్రులలో ఇద్దరు అక్కడే మరణించారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని జోగనహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్, మహేష్, రమేష్లు కొళగాళకి బైక్పై వెళ్తుండగా మైసూరు-హెచ్.డి.కోట రహదారిలో బైక్ను కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముగ్గురి పై నుంచి బస్సు వెళ్లడంతో మంజునాథ్ ప్రాణాలు కోల్పోగా, రమేష్ కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. సాయం చేయండని వీరిద్దరూ స్థానికులను ప్రాధేయపడినా వారు ముందుకు రాలేదు. అయితే వారు కూడా ప్రాణాలను కోల్పోయారు. జనారణ్యంలో మృగాల మధ్య ఈ ఘటన జరిగినా అవి తమ వారి ప్రాణాలను తోడేసుకున్నాయని మృతుల బంధువులు అవేదన వ్యక్తం చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more