ఉత్తరాఖండ్ లో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం నుంచి తాయిలాలు పోందుతున్న యోగా గురువు రాందేవ్ కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించింది. రాష్ట్రంలో అనిశ్చితికి దారితీసే పరిణామాలకు బాబా రాందేవ్ కుట్రలు, కుయుక్తులు పన్నుతూ అటు పార్టీ కార్యకర్త కన్న దిగజారుడు స్తాయిలో వ్యవహరిస్తూన్నారిన కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది, బాబా రాందేవ్ బీజేపీకి బ్రోకర్ లా పనిచేస్తూ.. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నిస్తున్నాడని దుయ్యబట్టింది.
పార్టీకిలో పదవులు రానీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి వారికి కాషాయ కండువా కప్పేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ ఆరోపించారు. పార్టీ మీద అగ్రహంతో వున్న ఎమ్మెల్యేలకు, కాషాయ పార్టీకి మధ్య బ్రోకర్ గా మారిన బాబా రాందేవ్.. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు యత్నిస్తున్నారని ఆయన అరోపించారు. నిత్యం శుభవాక్కులు పలుకుతూ.. సన్మార్గంలోనే నడవాలని ప్రజలకు చెప్పే బాబాలు ఇలాంటి హేయకరమైన చర్యలకు ఎలా పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో రాందేవ్ టచ్ లో ఉన్నారనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అసంతృప్త ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని అన్నారు. ప్రజలు తీర్పును గౌరవిస్తామని చెప్పే బీజేపి అందుకు భిన్నంగా ఎలా వ్యవహరించగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాందేవ్ తీరుతో స్వాములకే కాదు ఉత్తరాఖండ్ కు చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఏజెంట్ మాదిరిగానే కాకుండా పార్టీ కార్యకర్తలా కూడా వ్యహరిస్తున్నారని కిశోర్ ఉపాధ్యాయ మండిపడ్డారు. బీజేపికి అంతగా అధికార దాహం వుంటే అసెంబ్లీ ఎన్నికల వరకు అగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవానలి ఆయన సూచించారు.
కాగా, ఉత్తరాఖండ్ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోలేదని యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తతో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. అమిత్ షా, నరేంద్ర మోదీని స్వతంత్రంగా పనిచేసుకోవాలని సూచించారు. గురువారం హరిద్వార్ లో పూలతో రాందేవ్ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పనిలేదని అన్నారు. అయతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థాయికి మించి తాయిలాలు అందుతున్న నేపథ్యంలో యోగా గురు ఈ చర్యలకు పాల్పడి వుండవచ్చన విమర్శలు కూడా వినబడుతున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more