ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకే కాదు ఏ నాయకుడికైనా కావాల్సింది రెండు లక్షణాలు అని జగన్ అన్నారు. చట్టసభ కోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడం బాధాకరం. రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. యునానిమస్ గా రోజాను సభ సస్పెండ్ చేశారు అని స్పీకర్ ప్రకటించారు. కానీ రూల్స్ లో లేకపోయినా అబద్దాలు చెబుతున్నారు. రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం మీద నిరసన తెలిపేందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. రోజా సస్పెన్షన్ విషయంలో స్పీకర్ అబద్దాలు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. న్యాయస్థానం తీర్పులను కూడా గౌరవించలేని పరిస్థితి నెలకొంది. సభను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షనాయకుడు జగన్ వెల్లడించారు.
చంద్రబాబుకు లేని రెండు ఏంటంటే...
క్యారెక్టర్(వ్యక్తిత్వం)- అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీఆర్ ను హత్య చేయడం ఆయన క్యారెక్టర్ అని జగన్ ఆరోపించారు.
క్రెడిడిలిటి(విశ్వసనీయత)- ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్దాలు చెప్పడం. ఎన్నికల తర్వాత ప్రజలను మోసం చెయ్యడం అని జగన్ అన్నారు.
ఈ రెండూ ఆయనకు లేవు కాబట్టే ప్రజల్లోకి వెళ్లలేక లంచాలతో సంపాదించిన డబ్బుతో వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని జగన్ అన్నారు. సిగ్గు, రోషం, లజ్జ ఏమాత్రం ఉన్నా ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయండి. ఎన్నికల ద్వారా ప్రజల్లోకి వెలదాం.. చూద్దాం అని జగన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more