ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడి సాధిద్దామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వం లో 300 మందితో కూడిన ప్రతినిధి బృందం ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా కోటి సంతకాల సేకరణను, 13 జిల్లాల్లో మట్టి, నీళ్లను సేకరించి ఢిల్లీకి తెసుకువెళ్లారు. కోటి సంతకాల జాబితాలో సోనియా, మన్మోహన్సింగ్, రాహుల్గాంధీ సంతకాలు చేశారు. సోనియా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్యాయమైన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించి న్యాయం చేయాలనే సదుద్దేశ్యంతోనే తాము దానిని విభజన చట్టంలో పొందుపర్చామన్నారు.
అమె మాట్లల్లోనే.. ‘ముందుగా లెమాటి వెంకయ్య (గుండెపోటుతో మృతి చెందిన చలోఢిల్లీ బృందంలోని సభ్యుడు) కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నా. అంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం అసువులు బాసిన వీరులను స్మరించిన అమె.. హోదా మన హక్కు అని ధైర్యంగా పోరాడాలి. ఈ విషయంలో ఎవరూ మనస్తాపం చెందకూడదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు మీరు కోటి సంతకాల సేకరణ, మట్టి, నీళ్లు సేకరించి తీసుకొచ్చి పోరాడుతున్న తీరుకు అభినందనలు.
ఆంధ్ర ప్రదేశ్ విభజన సందర్భంగా ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పన్ను రాయితీలు, పోలవరం ప్రాజెక్టు తదితర అనేక అంశాల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ అమలు చేయాల్సిందిపోయి అనిశ్చితిలో పడేసింది. అటు టీడీపీ, ఇటు బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తున్నాయి. ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు ప్రకటన చేస్తారనుకుంటే ఏపీకి నీళ్లు, మట్టి ఇవ్వడం బాధాకరం. మేమంతా మీవెంట ఉంటాం. పార్లమెంటులోనూ, వెలుపలా పోరాడుదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం..’ అని పేర్కొన్నారు.
ఏపీ ప్రజలకు విభజన చట్టం హామీలతోపాటు నాడు రాజ్యసభలో తానిచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కోరారు. ఆంధ్రపద్రశ్ కు ప్రత్యేక హాదా విషయంలో ఆనాడు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. హోదా వచ్చే వరకూ పోరాడుదామని, విభజన హామీలు నెరవేరే దాకా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల క్రితం పెద్దమార్పు చోటు చేసుకుంది. నాటి ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏపీకి అండగా ఉంటామన్నాం. కానీ దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సాయపడడం లేదు. స్పెషల్ స్టేటస్ కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనేందుకు నేను కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చాను. కాంగ్రెస్ చేస్తున్న కృషి వృథా కాదు’ అని పేర్కొన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more