నగరి ఎమ్మెల్యే ఆర్.కె రోజాకు అనుకూలంగా హైకోర్టు తీర్పువెలువడింది. అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన కారణంగా ఏడాదిపాటు సభ నుండి సస్పెన్షన్ కు గురైన రోజా తనకు అన్యాయం చేశారని పేర్కొంది. తన సంజాయిషీ కూడా తీసుకోలేదని.. చివరకు తనకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేదని ఆమె వివరించారు. అయితే దీని మీద హైకోర్టును ఆశ్రయించగా. హైకోర్టు రిజిస్ట్రార్ దీన్ని విచారణకు స్వీకరించలేదు. కాగా రోజా మాత్రం పట్టువదలకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో హైకోర్టు రోజా సస్పెన్షన్ కేసును విచారించింది. చివరకు రోజాకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
నిన్న ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాట సుదీర్ఘంగా సాగిన వాదనల్లో రోజా తరపు న్యాయవాది బలంగా వాదించారు. రోజా సస్పెన్షన్ విషయంలో స్పీకర్ సభ సంప్రదాయాలను విస్మరించారని వాదించారు. సభలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అనుచితంగా ప్రవర్తిస్తే ఒక రోజు మాత్రం సస్పెండ్ చెయ్యాలని... అలా కాకుండా సభ్యలు అనుమతితో ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చెయ్యవచ్చు కానీ ఇలా ఏడాదిపాటు సస్పెన్షన్ వేసే అధికారంలేదని రోజా తరఫు లాయరు వాదించారు. తన క్లయింట్ కు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా స్పీకర్ కార్యాలయం అనైతికంగా వ్యవహరించిందని అన్నారు. కాగా దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో రొజా హాజరు కావయచ్చని తెలిపింది. కాగా మిగిలిన విచారణను నాలుగు వారాల తర్వాత కొనసాగిస్తామని హైకోర్టు వెల్లడించింది.
Read Also: వస్తున్నానంటున్న రోజా
Read Also: యనమల చేసిన తప్పే రోజాకు కలిసివచ్చింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more