ప్రతిపక్షంలో వుండగా, ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అనే నేతలు.. అధికారంలోకి రాగానే అదే ప్రజలపై తమ జులుం ప్రదర్శిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే వారిని ఓటర్లుగా పరిగణించి కాళ్లు వేళ్లు పట్టుకుని ఓట్లు అడిగే నేతలు గెలిచి అధికార ఫీఠాలను అధిరోహిస్తే.. వారిపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. తమ కన్ను పడిన భూములన్నింటినీ సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వారి దౌర్జన్యానికి లొంగని ప్రజలపై అధికారులతో హుకం జారిచేయించి మరీ తమ అధిపత్యాన్ని చాటుకుంటున్నారు.
ఇందుకు స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు కె.రామ్మోహన్నాయుడు మంగళవారం దౌర్జన్యానికి దిగారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో గ్రామ కంఠాల భూ కబ్జాకు యత్నించారు. అందులోభాగంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్థలం పక్కనే ఉన్న భూమిలో నిర్మాణం జరగుతున్న ఇల్లును కూల్చివేశారు. అయితే ఎంపీ రామ్మోహన్ గతంలో తన స్థలం అడిగారని... అందుకు తాను నిరాకరించానని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీ రామ్మోహన్నాయుడు దౌర్జన్యానికి దిగారని బాధితుడు ఆరోపించారు.
గ్రామకంఠం కింద ఎంపీ రామ్మోహన్నాయుడుకు శ్రీకాకుళంలో 40 సెంట్ల స్థలం ఉంది. అలాగే రెండు, మూడు సెంట్ల గ్రామ కంఠానికి చెందిన స్థలంలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఆ భూములు విక్రయించాలని ఎంపీ... స్థానికులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు వారు ససేమీరా అన్నారు. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ స్థానిక ఎమ్మార్వో చెప్పడంతో.. స్థానికులు కోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టు స్టేటస్ కో విధించింది. ఆ క్రమంలో రామ్మోహన్రావు రంగంలోకి దిగారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more