విజయవాడ గొల్లపూడి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా నలుగురు మెడికో విద్యార్ధులు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఉస్మానియా మెడికల్ కాలేజి విద్యార్ధులు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు అమలాపురంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొని.. తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. వీరంతా ధనుంజయ్ ట్రావెల్స్ బస్సులో నగరానికి బయలుదేరారు. కానీ గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్ వద్ద చెట్టుకు బస్సును ఢీకొంది. అక్కడికక్కడనే నలుగురు మెడికోలు, డ్రైవర్ దుర్మరణం చెందారు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది వైద్య విద్యార్ధులున్నారు.
మద్యం మత్తులో డ్రైవర్ బస్సును నడిపాడని పోలీసులు పేర్కొన్నారు. కంట్రోల్ కాకపోవడంతో చెట్టుకు ఢీకొట్టాడని తెలిపారు. అమలాపురంలో క్రీడల్లో పాల్గొనేందుకు వీరంతా ఇక్కడకు రావడం జరిగిందన్నారు. కాగా బస్సులో చోరీ జరిగిందని ప్రమాదం అనంతరం విద్యార్థులు తెలిపారు. సెల్ ఫోన్స్ , నగదు చోరీ కావడంతో తాము ప్రశ్నించడం జరిగిందని అప్పటికే క్లీనర్ పరారీ అయ్యాడని పేర్కొన్నారు. ఇతని కోసం వెతికి పట్టుకున్నామని, అనంతరం బస్సు వెనక కూర్చొబెట్టామన్నారు. అనంతరం ఈ విషయంపై డ్రైవర్ ను ప్రశ్నించడం జరిగిందని, కానీ డ్రైవర్ ర్యాష్ గా బస్సును నడిపించాడని తెలిపారు. కావాలనే ఇదంతా చేశాడని పేర్కొన్నారు. డ్రైవర్, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ర్యాష్ గా నడపడంతో బస్సు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more