ఏపి అసెంబ్లీలో మాటల తూటాలు పేలుతున్నాయి. అవిశ్వాస తీర్మానానికి తెర తీసిన వైసీపీ పార్టీ అధినేత జగన్ చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసిన జగన్ మీద బోండా ఉమాలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ఏపీ అసెంబ్లీలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు తన మనసుకు కష్టం కలిగించే విధంగా ఎన్నో మాట్లాడారని జగన్ చెప్పారు. పరిటాల రవీంద్ర హత్య కేసుకు సంబంధించి అధికార పార్టీ సభ్యులు తనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. తనపైన చేసిన ఆరోపణలు నిజమైతే జేసీ దివాకర్ రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. తన ప్రవర్తన గురించి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. పరిటాల రవి కేసుకు సంబంధించి కోర్టు తీర్పు కూడా ప్రకటించిందని, నిందితులెవరో తేలిన తర్వాత కూడా తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అధికార పక్ష సభ్యులపై జగన్ మండిపడ్డారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబేనని స్వయాన అప్పటి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న హరిరామజోగయ్య పుస్తకంలో రాశారని జగన్ చెప్పారు.
తొలి నుంచి జగన్ ది నేర చరిత్రేనని ఎద్దేవా చేశారు. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై 22 ఏళ్ల వయసులోనే దాడి చేసి పోలీసులపై చేయి చేసుకున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఈ మేరకు జగన్ పై కేసులు కూడా నమోదయ్యాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా సదరు ఘటనకు సంబంధించి ఆధారాలను కూడా ఆయన ప్రదర్శించారు. తుని విధ్వంస ఘటన వెనక జగన్ ఇలాకా పులివెందుల నుంచి వచ్చిన రౌడీలే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more