ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పచ్చి బాలింతరాలని కూడా చూడకుండా మహిళపై ఇద్దరు దుండగులు పైశాచిక మృగాల కంటే ఘోరంగా ప్రవర్తించారు. బస్సులో తన ఇద్దరి పిల్లలతో ప్రయాణిస్తున్న ఒంటరి మహిళపై.. కామంతో కళ్లు మూసుకుపోయిన బస్సు డ్రైవర్, కండెక్టర్ సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ మగమృగాళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో ఆమె ఒడి నుంచి 14 రోజుల పసికందు జారిపడి మరణించాడు. అయినా కనుకరించనా కామాంధులు అమెపై అత్యాచారం జరిపి నిర్మూనుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లారు.
రామ్ బరేలీ సూపరింటెండెంట్ పోలీసు అధికారి ఆర్కే భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్పూర్కు చెందిన 28 ఏళ్ల యువతి తన ఇద్దరు పిల్లలతో కలసి రాయ్ బరేలిలోని సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి రాయ్పూర్కు తిరిగి వెళ్లేందుకు ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తూ ఆమె నిద్రపోయింది. బస్ స్టాప్లో మిగతా ప్రయాణికులందరూ దిగిపోగా నిద్రమత్తులో ఉన్న ఆమె గమనించలేదు. అలానే తన ఇద్దరు పిల్లలతో బస్సులోనే ప్రయాణించింది.
కోద్ది దూరం వెళ్లిన తరువాత అమెను గమనించిన డ్రైవర్, కండక్టర్.. పచ్చి బాలింతరాలన్న కనికరం కూడా లేకుండా అమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వారిని ప్రతిఘటించి, అత్యాచారం నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో అమె ఒడిలోని 14 రోజుల బిడ్డ కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. అయినా మగమృగాళ్లు అమెను వదలకుండా అత్యాచారం జరిపారు. ఆ తరువాత బస్సు డ్రైవర్, కండెక్టర్ ఆమెను రోడ్డుపై దించివేసి వెళ్లిపోయారు.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా పసికందు మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు, బాధితురాలిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు. అయితే నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిపై 14 రోజుల పసికందు మరణానికి కారణమైన చట్టాలతో కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియలేదు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేసుకోగా.. ఆమెకు మరచిపోలేని పీడకలను మిగిల్చింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more