ఏపి మంత్రి రావెల కిశోర్ తనయుడు పోకిరీ వేషాలు వేశారు. మహిళను వేధించడంతో స్థానికులు మంత్రిగారి కొడుకుకు దేహశుద్ది చేశారు. రావెల కిశోర్ బాబు కొడుకు సుశీల్ కుమార్ తాజాగా వేసిన పోకిరీ వేషాలు వెలుగులోకి రావడంతొ రావెల మీద విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 13లో ఈ సంఘటన జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం... ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఓ మహిళ... గురువారం సాయం త్రం తన ఇంటికి బయలుదేరింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో సుశీల్ ఆమెను వెంబడించాడు. కొద్దిదూరం వెళ్లాక సుశీల్ ఆమె చేయిపట్టుకుని లాగాడు. ఆ మహిళ బిగ్గరగా అరవడంతో స్థానికులు పోగయ్యారు. ఆమె భర్త కూడా అక్కడకు చేరుకున్నాడు. జరిగింది తెలుసుకున్న స్థానికులు సుశీల్తోపాటు కారు డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. వారిని పోలీసులకు అప్పగించి... ఫిర్యాదు చేశారు.
సుశీల్ ఏపీ మంత్రి రావెల్ కిశోర్ కుమార్ కొడుకు అని తెలియడంతో పోలీసులు అతడిని కేసు నుంచి తప్పించే యత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విషయం మీడియాకు పొక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం డ్రైవర్పైనే లైంగిక వే ధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. కిశోర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. డ్రైవర్ను కూడా పంపేశారు. అయితే బాధితురాలి బంధువులు మరోసారి స్టేషన్కు వెళ్లి కేసుపై ఆరా తీశారు. నిందితులు ఎక్కడంటూ నిలదీశారు. మరోవైపు... సుశీల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఆయన తండ్రి వద్ద పనిచేసే మణికొండ రమేశ్ అనే వ్యక్తి పోలీసులు రాత్రి పదిగంటలకు ఫిర్యాదు చేశారు. కారును కూడా ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more