ఫ్రీడమ్ 251 పేరుతో అత్యంత చౌక ధరకు స్మార్ట్ఫోన్ అందిస్తామన్న ప్రచారంతో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంస్థ రింగింగ్ బెల్స్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశాన్ని జాతీయ మీడియా వెలుగులోకి తీసుకోచ్చాయి. ఫ్రీడమ్ ఫోన్ల తయారీ సంస్థ రింగింగ్ బెల్స్కు సంబంధించిన నోయిడా కార్యాలయం మూసివేసి ఉన్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఆఫీస్కు సంబంధించిన అద్దెను చెల్లించడంలో విఫలమైనందున ఆ కార్యాలయానికి తాళాలు పడినట్లు తెలుస్తోంది.
అయితే రింగింగ్ బెల్స్ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాత్రం తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని, ఎక్కడికి పారిపోవడం లేదని వెల్లడించారు. రింగింగ్ బెల్స్ సంస్థ సీఈవో మోహిత్ గోయల్ను ఫ్రీడమ్ 251 మొబైల్ ధరను గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. మొబైల్ల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్ల డబ్బు విషయంలోనూ ఈడీ విచారణ చేపట్టినట్లు సమాచారం. దిగ్గజ సంస్థలకు సైతం సాధ్యం కానటువంటి అత్యంత చౌకయిన ధరకు స్మార్ట్ మొబైల్ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ముందుకు రావడంతో ఈ సంస్థపై ఇప్పటికే ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కాగా ఈ నేపథ్యంలో ఆఫీసును మూసేశారన్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. కార్యాలయం అద్దెనే చెల్లించలేని సంస్థ అత్యంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ లను ఎలా అందిస్తున్న సందేహాలు రెకెత్తున్నాయి. సుమారుగా కోట్ల సంఖ్యలో ఫోన్లను ఎలా తయారు చేస్తారన్న అంశంపై కూడా సంబంధిత అధికారులు రింగింగ్ బెల్స్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే రింగింగ్ బెల్స్ యాజమాన్యం ఆన్ లైన్ ద్వారా ఫోన్లను బుక్ చేసుకున్న వారికి వారి డబ్బలును చెల్లించేస్తున్నాయి.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more