దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఢిల్లీలోని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నా.. అబలలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే వున్నాయి. నిర్భయ ఘటనను యావత్ దేశంలో పాటు బీజేపి కూడా ఖండించింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. అత్యాచారాలను నిరోధించడానికి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన బీజేపి నేతలు.. గత రెండేళ్లుగా మహిళలపై గ్యాంగ్ రేప్ లు, అత్యాచారాలు జరుగుతున్నా తదనంతర చర్యలు తీసుకోవడం మినహా ముందస్తు చర్యలు తీసుకుని వాటిని నిరోధించడంలో మాత్రం విఫలమవుతున్నారు.
ప్రభుత్వం నిర్లక్యాన్ని, అసమర్థతను, దీనికి తోడు పోలీసుల వున్న తీవ్రమైన పనిఒత్తిడిని అదనుగా చేసుకుని సాయంత్రంమైతే చాలు దేశరాజధాని వీధుల్లోకి తెగబడుతున్న పైశాచిక మృగాలు మహిళలను కిడ్నాప్ చేయడం, వారికి మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారాలకు తెగబడటం నిత్యకృత్యంగా మారిపోయింది. దేశ రాజధానిలో పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా.. మహిళలకు మాత్రం ఏవ్వరూ భద్రతను కల్పించలేకపోతున్నారు.
తాజాగా కదులుతున్న కారులో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు ఆనంద్ విహార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రాత్రి 10 గంటల ప్రాంతంతో ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు షాపింగ్ మాల్ కు వెళ్లిన బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆమెపై దాడి చేశారు. తర్వాత ఆమెను మధు విహార్ లోని కడ్కీ మోడ్ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. నిందితులు వియోగించిన కారును గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more