రిజర్వేషన్ల నిప్పుల కొలిమిలో మరోసారి హర్యానా రాష్ట్రం మండిపోయింది. హర్యాణాలో జట్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. వెనుకబడిన కులాల జాబితాలో తమకు రిజర్వేషన్ కల్పించాలంటూ ఉద్యమబాట పట్టిన జాట్ల నిరసన శుక్రవారం పూర్తిగా అదుపు తప్పింది. హరియాణా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది. పలుజిల్లాల్లో భారీఎత్తున హింసాత్మక సంఘటనలు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. దీంతో రెండు జిల్లాల పరిధిలో కర్ఫ్యూ విధించి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. తొమ్మిది జిల్లాల్లో సైన్యాన్ని మోహరించారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించగా, 25 మంది గాయపడ్డారు.
హర్యాన. రాష్ట్ర ఆర్థికమంత్రి ఇంటిని, అధికారపార్టీ భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను, ఇళ్లను, కార్యాలయాలను, రెండు టోల్ప్లాజాలను ధ్వంసం చేశారు. ఇదిలా వుండగా ఈ జాట్ల ఆందోళన కారణంగా ఆందోళన కారణంగా ఆసుపత్రి వెళ్లలేక ఒక క్యాన్సర్ రోగి మృతిచెందారు. జింద్ జిల్లాలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆనంద్ మెదడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. శుక్రవారం అస్వస్థతకు గురవడంతో నర్వాన్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వంద కి.మీ. దూరంలో ఉన్న రోహ్తక్లోని పెద్దాసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే అప్పటికే జాట్ల ఆందోళన హింసాత్మకంగా మారడంతో రోగిని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదని కుంటుంబ సభ్యులు తెలిపారు. దీంతో రెండు గంటల అనంతరం ఆనంద్ పరిస్థితి మరింత విషమించి మృతిచెందినట్లు వివరించారు. రోగిని రోహ్తక్ తరలించి వెంటిలెటర్ సౌకర్యం కల్పించి ఉంటే ప్రాణాలు దక్కేవని జిల్లా ఆసుపత్రి వైద్యుడు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more