భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు ఓ వార్త కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్న భూమా నాగిరెడ్డి తర్వాత చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. ప్రస్తుతం జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాగా వైసీపీ కీలక నేత, జగన్కు వెన్నంటి ఉన్న భూమా నాగిరెడ్డి కుటుంబం టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. మరికాసేపట్లో వైసీపీకి భూమా కుటుంబం షాక్ ఇవ్వనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. భూమా ఫ్యామిలీతో పాటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కబోతున్నారని ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. భూమా నాగిరెడ్డి పీఎసీ చైర్మన్గా, కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ మారుతున్నట్లు భూమా తన అనుచరులతో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరితే మంత్రి పదవి వస్తుందని కూడా అనుచరులకు భూమా చెప్పినట్లు వినికిడి.
భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో చేరితే ఓ మంత్రి పదవిని చంద్రబాబు ఇస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డలు పూర్తిగా వెనుకబడ్డాయని, వాటి అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరందుకు మొగ్గు చూపుతున్నారట. భూమాకు కర్నూలు జిల్లాలో మంచి బలగం ఉంది. ఈ నేపథ్యంలో భూమాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం కార్యకర్తలతో భేటీ అనంతరం చేరుతారా లేదా తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more