తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. కాగా ఆయన భార్య శైలిమకు అసలు ఓటే లేదని అధికారులు చెబుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆమెకు ఓటు లేదని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. ఆమె స్వగ్రామంలో కూడా ఓటు హక్కు లేదని తెలుస్తోంది.అటు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. మరోవైపు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రామ్ నగర్ లో ని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన దత్తన్న.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో కాంగ్రెస్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కాచిగూడలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, కేకే కూతురు విజయలక్ష్మి తదితరులు ఓటేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుంది. 26వేల మంది పోలీసులు బందోస్తులో ఉన్నారు. 3వేల మందితో పోలింగ్ ప్రక్రియను వెబ క్యాస్టింగ్ చేస్తున్నారు.
కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. తొలి మూడు గంటల్లో పది శాతం ఓటింగ్ కూడా కాలేదు. ఈ ఉదయం 7 గంటల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రారంభం కాగా, పోలింగ్ మందకొడిగా సాగుతోంది. దాదాపు అన్ని డివిజన్లలోని పోలింగ్ బూత్ ల వద్ద ఓటేసేందుకు వస్తున్న ప్రజల సంఖ్య స్వల్పంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల బూత్ లు ఖాళీగా కూడా కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more