కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న కాపులు తుని రైల్వేస్టేషన్లో ఆందోళన చేపట్టారు. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ డిమాండ్ నెరవేర్చే వరకు రైల్రోకో, రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనకారులు తుని రైల్వేస్టేషన్కు చేరుకుని.. ఆ సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ముట్టడించారు.
ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పలు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటీన ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పిస్తున్నారు.
తాము రెండు డిమాండ్లు కోరడం జరుగుతోందని, కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించాలని..రిజర్వేషన్ల జీవో జారీ చేయాలని ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సభ నుండి పోరాడం కాదని..రైలు పట్టాలు..రోడ్లపై నిలబడి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. వెంటనే తనతో పాటు ఉద్యమంలోకి రావాలని..ఉద్యమంలో ముందు తన కుటుంబం ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయం కోసం అడుగుతుంటే కాలయాపన చేయడం సరికాదన్నారు. రాజధానికి, గ్రీన్ పోర్టు, భూములు తీసుకోవడానికి అర్ధరాత్రి జీవోలు జారీ చేసిన సందర్భాలున్నాయన్నారు. తమ స్పష్టమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఇంటికి వెళ్లేది లేదని ఖరాఖండిగా చెప్పడంతో ఆందోళన ఒక్కసారిగా రూటు మారింది.
* కాపులను బిసిలలో చేర్చడానికి కమీషన్ ను నియమించాలన్న రాష్ట్రమంత్రి వర్గనిర్ణయం కాలయాపన ఎత్తుగడే- ముద్రగడ.
* ప్రస్తుతం ఏ రాజకీయపార్టీలోనూ లేని ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్ పై ఆ వర్గం నాయకులు మేధావులతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. రాజకీయంగా అధికారంలోకి వస్తే కాపు సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న సూచనలను ముద్రగడ తిరస్కరించారు.” ఇందువల్ల అధికారంలోకి వచ్చిన వారు, వారి ప్రభావం పడే మరికొందరు ఎదుగుతారేమోకాని కాపుల్లో పేదలు పేదలుగానే వుండిపోతారు. సామాజికంగా ఆర్ధికంగా కాపులు ఎదగాలంటే రాజకీయపరమైన సర్దుబాట్లు కాక రాజ్యాంగ పరంగా చట్టబద్ధమైన హక్కులు సాధించవలసిందేనని” నిర్ధారించుకున్నాకే ఆయన కాపు మహాసభకు జనవరి 31 ముహూర్తంగా నిర్ణయించారు.
* చంద్రబాబు పాదయాత్ర సమయంలోనూ, 2014 ఎన్నికల ప్రచార సభల్లోనూ కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడమే మహాసభ ఎజెండా. కాపులను బిసిల్లో చేర్పించుకోవడం, వీరి సంక్షేమానికి ఏటా 1000 కోట్లరూపాయలు ఖర్చు చేయించుకోవడం తప్ప మరో డిమాండు లేదు
* ఇలా రోడ్డున పడటం ఏ రాజకీయపార్టీకీ, ఏకులానికీ వ్యతిరేకం కాదు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే పుట్టగతులు వుండవు- ముద్రగడ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more