పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఢిల్లీని ముక్కుమూసుకునేలా చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన సెగ… కేజ్రీ సర్కారుకు ఊపిరాడకుండా చేస్తోంది. వేతనాలు రెగ్యులర్ గా చెల్లించాలని… కార్మికులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. ఢిల్లీలో మొత్తం మూడు రకాల మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. వాటిలో 60 వేల మంది సఫాయి కార్మికులతో పాటు… మొత్తం లక్షా 25 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఆరేడు నెలలుగా కార్మికులకు వేతనాల్లేవు. వేతన బకాయిల కోసం ఆప్ సర్కారు మీద తిరుగుబాటు చేశారు కార్మికులు. మొత్తం 27 కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి.
డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి ముందు చెత్త వేసి వినూత్న నిరసనకు దిగారు కార్మికులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఆందోళకారులకు మధ్య తోపులాట జరిగింది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదని.. వేతన బకాయిలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు కార్మికులు. కార్మికుల సమ్మెను లైట్ తీసుకున్నారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఇవి బీజేపీ నేతలు చేయిస్తున్న చెత్త రాజకీయాలని మండిపడ్డారాయన. మరోవైపు కార్మికులు సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more