వైసిపి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ పైన చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో శనివారం రాత్రి పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం అతనికి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను విధించారు. గట్టి బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం చెన్నై నుంచి శ్రీకాళహస్తికి మిథున్ రెడ్డిని తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మిథున్ అరెస్టు అన్యాయమని ఆందోళన నిర్వహించారు. టిడిపి కక్షపూరిత రాజకీయాలు వదిలిపెట్టాలని మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు. వైసిపిని అణగదొక్కేందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు.
ఎయిరిండియా మేనేజరుపై దాడి చేసిన కేసులో తాము మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులను జారీ చేశామని పోలీసులు తెలిపారు. వాటి కారణంగా చెన్నై విమానాశ్రయంలో కనిపించిన మిథున్ రెడ్డిని, అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆపై తిరుపతి పోలీసులకు అప్పగించారన్నారు. మిథున్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి సైతం విమానాశ్రయంలో పట్టుబడ్డారని, వీరిద్దరినీ కేసు నమోదైన శ్రీకాళహస్తికి తీసుకువచ్చి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని చెప్పారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ఆరుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more