బారత రైల్వేల గురించి కొత్తగా చెప్సక్కర్లేదు. ప్రపంచంలోని రవాణాలో మన వాటా తక్కువేమీ కాదు. ప్రజా రవాణాలో ఇండియన్ రైల్వేలు నాలుగుశాతం భాగస్వామ్యం వహిస్తున్నాయి అంటే ఎంత బాగా మన రైల్వే నడుస్తోందో అర్థమవుతోంది. అయితే భారత రైల్వేకున్న ప్రధాన లోపం.. అధునీకరణ లేకపోవడం. తాతల కాలం నాటి బోగీలతో జనాలు విసిగిపోయారు. అయితే మోదీ సర్కార్ వచ్చినప్పటి నుండి పరిస్థితి కాస్త మారింది. రైల్వేల్లో శుభ్రత పెరగడం.... మెంటెనెన్స్ కూడా బాగా ఉండటం మంచి పరిణామం. అయితే తాజాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు.. రైల్వేలను అధునీకరించేందుకు పూనుకున్నారు. రైల్వేలను రాజసౌధాలుగా, అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు.
భారత రైల్వేల్లో కొత్త తరహా కోచ్ లను పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగా కంట్రోల్డ్ డిస్ చార్జ్ వాటర్ ట్యాప్, కొత్త టాయిలెట్ లు, ఆధునిక ఫ్యాన్, ఎల్ఈడీ లైట్లు, స్నాక్ టేబుల్స్ ఇలా అన్ని హంగులతొ కొత్తగా బోగీలు రూపుమార్చుకుంటున్నాయి. కొత్తగా రైళ్లు, రైళ్వే లైన్లు కాకుండా రైళ్లను ఆధునీకరిస్తామని మోదీ గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగా రైల్వే శాఖ తాజాగా చేస్తున్న మార్పులు ప్రయాణికులకు మరో కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ఎసీ-1, ఏసీ-2, స్లీపర్ బోగీలను అధునీకరించనున్నారు. ఒక్క బోగీని మార్చడానికి 25 లక్షల దాకా ఖర్చవుతోందని.. 111 బోగీలను ఆధునీకరించడానికి 31.5 కోట్లు ఖర్చైందని వెల్లడించారు రైల్వే అధికారులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more