ఓ మహిళా టీవీ రిపోర్టర్తో అసభ్యకరంగా ప్రవర్తించడంపై క్రిస్గేల్కు 10వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారు. నిన్న జరిగిన బిగ్ బాష్ లీగ్ ట్వంటీ20 మ్యాచ్ సందర్భంగా గేల్ ఓ మహిళా రిపోర్టర్తో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను అగౌరవపర్చేలా వ్యాఖ్యలు చేశారు. 'నీ కళ్లు అందంగా ఉన్నాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం తాగేందుకు వెళ్దామా.. సిగ్గుపడకు బేబీ' అంటూ గేల్ చెప్పాడు. క్రిస్గేల్ మాటలకు కొంత ఇబ్బందిపడినా... తాను సిగ్గుపడడం లేదంటూ మెల్మెక్ లాఫ్లిన్ ఇంటర్వ్యూను కొనసాగించింది. కాగా, గేల్ మాటలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు గేల్ వ్యాఖ్యలపై బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ (బీబీఎల్), ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించాయి.
క్రిస్ గేల్ వ్యాఖ్యలు అవమానకరమైనవని బీబీఎల్ వ్యాఖ్యానించింది. క్రిస్ గేల్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, వాటిని తాము జోక్గా తీసుకోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ మెక్గ్రాత్ స్పష్టం చేశారు. బిగ్ బాష్ సీఈఓ ఎవెర్డ్ సైతం గేల్ తీరు సరికాదని అన్నారు. 10 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 4 లక్షల 75 వేల రూపాయలు) జరిమానా వేశారు. ఈ మొత్తం రొమ్ము కేన్సర్ బాధితులకు సహాయం అందిస్తున్న మెక్ గ్రాత్ ఫౌండేషన్ కు వెళుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెబ్ సైట్ వెల్లడించిందిదీంతో క్రిస్గేల్ మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఆ మహిళ రిపోర్టర్కు క్షమాపణలు చెప్పాడు. ప్రజెంటర్ మెల్మెక్ లాఫ్లిన్ పట్ల తాను అవమానకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఆమె తన వ్యాఖ్యలకు బాధపడితే క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను జోక్గా తీసుకోవాలని, వాటిని సీరియస్గా తీసుకొవద్దని గేల్ పేర్కొన్నారు. నిరుడు కూడా కరీబియన్ లీగ్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టుతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి విమర్శల పాలయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more