సీపీఐ సీనియర్ నేత అర్ధేందు భూషణ్ బర్ధన్ (92) శనివారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తొలుత జీబీ పంత్ ఆస్పత్రిలోను, తర్వాత రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలోను చికిత్స అందించారు. శనివారం ఆయన కన్నుమూసినట్టుగా సీసీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా వెల్లడించారు. అయితే పెద్ద వయసు కావడంతో చికిత్సకు శరీరం సహకరించలేదు. బర్దన్ పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 1996-2012 సంవత్సరాల మధ్య సీపీఐకి జాతీయ కార్యదర్శిగా బర్దన్ పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్లోని బరిసల్ అనే ప్రాంతంలో ఆయన 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.
‘బర్ధన్ తన సిద్ధాంతాలు, నియమాలకు పూర్తిగా అంకితమైన ఒక ... కమ్యూనిస్టు నేతగా ఎల్లప్పుడూ గుర్తుంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ప్రధానమంత్రి నరేం ద్రమోదీ నివాళులర్పించారు. బర్ధన్ అస్తమయంతో సీపీఐ మాత్రమే కాదు.. తన జీవితమంతా పేదలు, అణగారిన వర్గాల కోసం కృషిచేసిన ఒక మహానాయకుడిని దేశం కోల్పోయింది’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ‘రెడ్ సాల్యూట్ కామ్రేడ్ బర్ధన్. మీ మేధస్సు, అనుభవం, మార్గదర్శకత్వం మాకు లోలుగానే ఉంటుంది’ అంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్లో వ్యాఖ్యల ద్వారా బర్ధన్కు నివాళులర్పించారు.
బర్ధన్ మృతి భారత రాజకీయాలకు తీరని నష్టమని బీజేపీ నేత, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ట్విటర్లో సంతాపం తెలిపారు. ‘సాధారణ ప్రజల కోసం నిరంతరం పోరాటం సాగించిన వామపక్ష మహానాయకుడు ఆయన’ అంటూ జేడీయూ అధ్యక్షుడు శరద్యాదవ్ నివాళులర్పించారు. తాను పన్నెండేళ్ల వయసులో తొలిసారి బర్ధన్ ప్రసంగాన్ని విన్నానని.. రాజకీయాల్లో చేరిన తర్వాత ఆయనతో సుదీర్ఘ సంబంధం కొనసాగించానని పేర్కొన్నారు. బర్ధన్ గౌరవప్రదమైన రాజకీయాలకు, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more