కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్కు నగరంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గోన్న దానం నాగేందర్ సహా అతని అనుచరులపై కోడిగుడ్లతో దాడులు చేశారు అదే పార్టీకి చెందిన పలువురు. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ 131వ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్యక్రమానికి ముందుగానే హాజరైన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ముందుగా పార్టీ జెండాను ఎగురవేశారు.
ఆలస్యంగా అక్కడికి చేరుకున్న దానం నాగేందర్, అతని అనుచరులు జెండాను కిందకు దించి.. మరో జెండాను మళ్లీ దానం చేత ఎగురవేయించారు. ఈ విషయం తెలుసుకున్న మల్లేష్ గౌడ్ అనుచరులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దానం నాగేందర్, అతని అనుచరులపై కోడిగుడ్లతో దాడి చేశారు. దానం అనుచరులను అక్కడి నుంచి తరమి కోట్టారు. దానం నాగేందర్ పై కూడా మల్లేష్ గౌడ్ చేయి చేసుకున్నాడని సమాచారం. అనూహ్యపరిణామాల నేపథ్యంలో దానం తన అనుచర గణంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. రంగారెడ్డి జిల్లా కార్యక్రమాల్లో పాల్గొన వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నా పై దాడి జరగలేదు దానం నాగేందర్
కాగా ఉప్పల్ లోని పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్ సినీయర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. తనపై మల్లేష్ గౌడ్ సహా, ఆయన అనుచరులు ఎవ్వరూ దాడి చేయలేదని చెప్పారు. పార్టీ అవిర్భావ కార్యక్రమంలో పార్టీ పతాకాన్ని ఎగురువేస్తున్న క్రమంలో మల్లేష్ గౌడ్ వర్గీయులు అభ్యంతరం తెలిపారని, అంతేకాని దాడులు జరగలేదన్నారు. అయితే ఇరువర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అది తీవ్రస్థాయికి చేరడంతో అనుచరుల మధ్య తొపులాట కూడా చోటుచేసుకుందని దానం తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more