బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులకు శుభవార్త. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటి రెండు నెలల స్కీం కింద 80 శాతం మొబైల్ కాల్రేట్లను తగ్గిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ఇతర నెట్వర్క్ల పోటీని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించే దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఒక నిమిషం, ఒక సెకన్ బిల్లింగ్ ప్లాన్ వంటి కొత్త ఆపర్లతో వినియోగదారుల మందుకు వస్తోంది.
అయితే కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులు తొలుత రూ. 36 వోచర్( ఒక సెకన్ ప్లాన్)తో రిచార్జ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. రూ. 37 తో రిచార్జ్ చేసుకున్నట్లయితే వారికి నిమిషానికి 10 పైసల చొప్పున చార్జ్ చేయబడుతుందని తెలిపింది. దీంతో కొత్త యూజర్లు తమ సర్వీసులను పునరుద్ధరించుకోవడానికి చక్కగా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపామ్ శ్రీవాస్తవ పిటిఐకి తెలిపారు. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటిసారి ఒక సెకన్ ప్లాన్ కోసం తొలుత రూ. 36 వోచర్, ఒక నిమిషం ప్లాన్ కోసం రూ. 37 వోచర్తో రిచార్జ్ చేసుకోవాలి.ఈ స్కీం (మొబైల్ నంబర్ పోర్టబులుటీ) వినియోగదారులు కూడా వర్తిస్తుందన్నారు.
అయితే రూ. 37 స్కీంలో ఉన్న వినియోగదారులకు లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకుంటే నిమిషానికి 10 పైసలు చొప్పున చార్జ్ చేయబడుతుంది. మిగతా నెట్వర్క్లకు కాల్ చేస్తే నిమిషానికి 30 పైసలు చొప్పున చార్జ్ పడుతుంది. అదేవిధంగా రూ. 36 తో రిచార్జ్ చేసుకుంటే బీఎస్ఎన్ఎల్ లోకల్, ఎస్టీడీ కాల్స్కు ప్రతి మూడు సెకన్లకు ఒక పైసా చొప్పున చార్జ్ పడుతుంది. అలాగే ఇతర సర్వీసులకుగానూ ప్రతి మూడు సెకన్లకు 2 పైసల చొప్పున కాల్ చార్జీలు వర్తిస్తాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more