లోక కళ్యాణం కోసమే అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశలంలో ఈ యాగాన్ని నిర్వహించే రెండో వ్యక్తి తానేనని చెప్పారు. దేశంలో ఇంతవరకు శృంగేరి పీఠం సారథ్యంలో మాత్రమే ఈ యాగాన్ని జరిపినట్లు తెలిపిన కేసీఆర్ రెండో వ్యక్తిగా ఈ యాగాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గతంలో కాకతీయుల కాలంలో యాగం నిర్వహించినట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఆధారాలు ఏమీ లేవన్నారు. ఈ యాగానికి మొత్తం ఖర్చు తానే స్వయంగా భరీస్తున్నానని తెలిపిన ముఖ్యమంత్రి.. యాగానికి ఖర్చు తక్కువేనని, కానీ ఏర్పాట్లుకు మార్గం ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు. తాను కూడా ఓ కార్యకర్తలా యాగానికి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటున్నానని తెలిపారు.
యాగం చేసే రుత్విజులు అందరూ చాలా పవిత్రంగా, నిష్టగా ఉంటారని… వారు ఎవ్వరిని తాకకుండా యాగం నిర్వహిస్తారని… ఒక వేల ఎవరైనా తాకితే రుత్విజులందరూ స్నానమాచరించాల్సి ఉంటుందన్నారు. తాను కూడా మూడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడుతున్నట్లు కేసీఆర్ వివరించారు. యాగం విజయవంతంగా పూర్తి అయితే లోకాభివృద్ధికి దోహదపడుతుందని, అనుకోకుండా ఏదైనా లోపం జరిగితే ఆ దుష్పలితాన్ని సంకల్పం తీసుకున్నవారు అనుభవించాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పుకోచ్చారు. యాగంలోకి ఉపయోగించే సుమారు 400 క్వింటాళ్ల నెయ్యిని మిత్రుడు ఒకరు గుజరాత్ నుంచి పంపిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more