కాల్ మనీ కేసు, సెక్స్ స్కాండల్ వ్యవహారంపై వైసిపి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడా ఇలాంటిది వినలేదని రోజా అన్నారు. నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని విజయవాడలోనే ఇదంతా జరుగుతోందంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైసిపి అధ్యక్షుడు జగన్ మీద ఎదురుదాడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రోజా మండిపడ్డారు. కాల్ మనీ వ్యవహారంపై చర్చించేందుకు టిడిపి భయపడుతోందని ఆమె ఆరోపించారు. భర్త ముందే భార్యను తీసుకెళ్లి ఎప్పుడు వదిలిపెడతారో కూడా తెలియని ఘటనకు చోటు చేసుకున్నాయని అన్నారు. అప్పు తీసుకున్న వారు చెల్లించకపోతే వారి పిల్లలను సైతం వ్యభిచారంలోకి దింపిన ఘటనలు చాలా బైటపడుతున్నాయని అన్నారు. ఈ కాల్ మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు కూడా సంబంధం ఉందంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. కాల్ మనీ వ్యవహారం సభను కుదిపేయడంతో స్పీకర్ కోడెల అసెంబ్లీని 10 నిమిపాల పాటు వాయిదా వేశారు. కాల్ మనీ కేసులో నిందితుడైన వెనిగళ్ల శ్రీకాంత్.. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కి సన్నిహితుడని, ఇద్దరూ కలిసి బ్యాంకాక్ వెళ్లారని రోజా అన్నారు. కాల్ మనీలో ప్రసాద్ కు భాగస్వామ్యం ఉందని స్థానికులు చెబుతున్నా ఆయనను ఎందుకు విచారించడం లేదని రోజా ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతరుల పేర్లు కూడా బయటకు వచ్చినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. సొంత పార్టీ నేతలను తప్పించేందుకు ఆ బురదను అందరికీ అంటించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రోజా దుయ్యబట్టారు. 18 ఏళ్ల లోపు పిల్లలను కూడా వ్యభిచారంలోకి దించుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తేనే మహిళలకు భరోసా ఇచ్చినట్లవుతుందని రోజా పేర్కొన్నారు. కాగా విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ను సెలవులో పంపేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించిందని రోజా ఆరోపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రపంచ స్థాయికి రాజధాని వెళ్తుందని చంద్రబాబు బాబు చెప్పారు. కానీ మొన్న వనజాక్షి విషయం, నిన్న కల్తీ మద్యం కేసు, ఇప్పుడు కాల్ మనీ వ్యవహారం.. ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్ర తాత్కాలిక రాజధానిలో తల దించుకునే పరిస్థితి ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more