విజయవాడలో కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఎక్సైజ్ శాఖ నిషేధించిన బ్రాండ్ల మద్యంలో కల్తీ జరగలేదని తేలింది. దీంతో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న స్వర్ణ బార్ లో మాత్రమే కల్తీ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. మరోవైపు ఈ ఘటనకు బాధ్యుడిగా విజయవాడ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పై ప్రభుత్వం వేటు వేసింది విజయవాడలో కల్తీ మద్యం ఘటన వెలుగు చూశాక ఎక్సైజ్ శాఖ మేల్కొంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేసింది. దాదాపు 9 బ్రాండ్లను సీజ్ చేసింది. అయితే వీటి శాంపిల్స్ ను పరీక్షించిన రీజనల్ కెమికల్ లేబొరేటరీ మాత్రం ఆ బ్రాండ్లలో కల్తీ జరగలేదని తేల్చి చెప్పింది. దీంతో.. ఇప్పుడు కల్తీ వ్యవహారం అంతా.. స్వర్ణ బార్ కు చుట్టుకోబోతోంది.
విజయవాడలో కల్తీ మద్యం ఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్... ఎక్సైజ్ శాఖపై కన్నెర్ర చేసింది. ఈ ఘటనపై విచారణకోసం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ బార్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు చెందినది కావడంతో ఇష్యూ కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఓవైపు సిట్ విచారణ, మరోవైపు నేతల మాటల యుద్ధం కొనసాగుతుండగానే... రీజినల్ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన నివేదిక.. కేసును మరో మలుపు తిప్పింది. మద్యం శాంపిళ్లను పరిశీలించిన లేబొరేటరీ... ఎక్సైజ్ శాఖకు నివేదిక ఇచ్చింది. నిషేధించిన 9 బ్రాండ్ల మద్యంలో పరిమితికి మించి మిథైల్ ఆల్కహాల్ లేదని రిపోర్ట్ లో తేల్చి చెప్పింది. దీంతో విజయవాడలో మాత్రమే మద్యం కల్తీ జరిగినట్లు అనుమానాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా స్వర్ణ బార్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇపుడు విచారణ కూడా ఈ బార్ చుట్టూనే కొనసాగే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more