బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసు నుంచి సల్మాన్ బయటపడ్డాడు. ఈ కేసులో ఆయన్ను దోషిగా నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ చూపుతున్న ఆధారాలు సరిపోవని అభిప్రాయపడ్డ బాంబే హైకోర్టు, ట్రయల్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సల్మాన్ పై నమోదైన అన్ని అభియోగాలనూ కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పు వెలువడే సమయంలో సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు కోర్టులోనే మౌనంగా కూర్చుని ఉన్నారు. కోర్టు బయట భారీ సంఖ్యలో చేరిన సల్మాన్ అభిమానులు తీర్పు తరువాత సంబరాలు జరుపుకున్నారు.
2002 సెప్టెంబర్ 28న వైల్ పార్లేలోని 'రాణి బార్ అండ్ రెస్టారెంట్'లో మద్యాన్ని సేవించిన సల్మాన్ టయోటా లెక్సస్ వాహనాన్ని నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని, దీంతో ఆ షాపు ఎదురుగా పడుకున్న ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు గాయపడ్డారని అభియోగాల నేపథ్యంలో దిగువకోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బొంబాయి హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రవీంద్ర పాటిల్ వాదనను పూర్తిగా నమ్మలేమని హైకోర్టు పేర్కొంది. ఘటన జరిగిన సమయంలో సల్మాన్ తాగి వాహనం నడుపుతున్నాడనే అంశాన్ని సందేహాలకు తావులేకుండా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని పేర్కొంది. దీంతో సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా విడుదల చేసింది.
పదమూడు సంవత్సరాల నాటి కేసు నుంచి విముక్తిని పొందిన అనంతరం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. మధ్యాహ్నం నుంచి కోర్టు హాల్లో, తన కుటుంబ సభ్యులతో కలసి కూర్చుని ఉన్న సల్మాన్ గంభీరంగా కనిపించాడు. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తరువాత, ఆయన బంధువులు ఒక్కసారిగా చుట్టుముట్టగా, సల్మాన్ కంట కన్నీరు కారింది. తన వారిని పట్టుకుని ఆయన బోరున విలపించాడు. కాగా, సల్మాన్ ఇంకొంతసేపు కోర్టులో ఉండాల్సి వుంది. బెయిలు బాండును క్యాన్సిల్ చేయించే పని ముగిసేవరకూ కోర్టులో ఉంటారని సల్మాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ వెల్లడించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more