దేశ రాజదాని దిల్లీలో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి వాతావరణం అంతకంతకు కాలుష్యంబారిన పడుతుండటంతో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే తాజాగా కేజ్రీవాల్ ప్రభుత్వం దీని మీద నివారణ, నియంత్రణ చర్యలకు పూనుకుంది. వాహనాల కారణంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ముందుగా చర్యలకు ఉపక్రమించింది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ చివరి అంకె సరి సంఖ్యనా లేదా బేసి సంఖ్యా అనే అంశం ఆధారంగా రోడ్లపైకి వాహనాలను రోజు విడిచి రోజు అనుమతించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విధానాన్ని 2016 జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ విధానం ద్వారా ఒక వాహనం రాజధానిలో 15 రోజులు మాత్రమే తిరిగే అవకాశముంటుంది. ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నట్లు గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఢిల్లీలో కాలుష్య సమస్య భయంకరంగా పెరిగిపోవడంపై హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేశాయి. దేశరాజధానిలో ప్రాణాంతకంగా మారిన కాలుష్యాన్ని నివారించేందుకు ఈ నెల 21లోగా కార్యాచరణ రూపొందించాలని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరి సంఖ్యతో ముగిసే నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ వాహనాలను ఒక రోజు, బేసి సంఖ్యతో ముగిసే నంబర్ ప్లేట్ ఉన్న వాహనాన్ని మరుసటి రోజు రోడ్లపైకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ నిబంధన ప్రభుత్వ వాహనాలకు వర్తించదని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది శీతాకాలంలో కాలుష్యస్థాయి రెట్టింపగుతున్నదని, కొద్దికాలంపాటు సరి, బేసి సంఖ్యలున్న వాహనాలను ప్రత్యామ్నాయ రోజుల్లో నడుపాలని నిర్ణయించారు. థర్మల్ కేంద్రాలను కూడా మూసివెయ్యాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా మెట్రో, మిగిలిన ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని కూడా దిల్లీ సర్కార్ నిర్ణయించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more