మన తెలుగు హీరోలు చెన్నై నగరానికి బాసటగా నిలుస్తున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నై నగరాన్ని ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా తెలుగు సినీ స్టార్స్ ముందుకు వస్తున్నారు. తమ వంతుగా ఇప్పటికే చాలా మంది తెలుగు స్టార్స్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా.. తాజగా చెన్నైకి అండగా మరికొన్ని నిధులను సేకరించేందుకు ముందుకు వచ్చారు. కేవలం సినీ తెర మీదే కాదు.. నిజ జీవితంలో కూడా తాము హీరోలమని.. తమ సినిమాలను ఆదరించిన చెన్నై నగరానికి తాము అండగా ఉంటామని అంటున్నారు. అందులో బాగంగా వారు సోషల్ మీడియా ద్వారా నిధులను అందించేందుకు పిలుపునిస్తున్నారు.
దగ్గుపాటి రాణా, నాని, నదదీప్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్, తరుణ్ లాంటి హీరోలు ఎవరికి తోచినంత వారు చెన్నై నగరానికి సహాయం చెయ్యాలని పిలుపునిస్తున్నారు. అందులో బాగంగా మన మద్రాస్ కోసం అంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. మద్రాస్ నగరానికి చేయూతనందించాలని పిలుపునివ్వడమే కాకుండా.. స్వయంగా కొంత మంది సిని హీరోలు విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్, మంజీరా, కూకట్ పల్లి ఫోరం మాల్స్ లో ఆదివారం రోజు స్వయంగా మద్రాస్ కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. దీని మీద ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటి దాకా తెలుగు స్టార్ ఇచ్చిన విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి..
రాఘవ లారెన్స్ - 1కోటి రూపాయలు
అల్లు అర్జున్ – 25 లక్షల రూపాయలు
ఎన్టీఆర్ – 10 లక్షల రూపాయలు
మహేష్ – 10 లక్షల రూపాయలు
రవితేజ – 5 లక్షల రూపాయలు
కళ్యాణ్ రామ్ - 5లక్షలు
వరుణ్ తేజ్ – 3 లక్షల రూపాయలు
సాయిధరమ్ తేజ్ – 3 లక్షల రూపాయల ఆహారం, వైద్య సదుపాయాలు
సంపూర్ణేష్ బాబు – 50 వేల రూపాయలు
సందీప్ కిషన్ – 5000 భోజనం ప్యాకెట్లు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more