దేవాలయాలకు వెళ్లేందుకు ఎక్కడా కూడా నియమ నిబంధనలు లేవు.. కానీ ఎంతో కాలంగా అక్కడ కొనసాగుతూ వస్తున్న ఆచారాలను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. అయితే తాజాగా ఓ ఆలయంలోకి మహిళ ప్రవేశించడంతో అపచారం చోటుచేసుకుంది. దాదాపు 500 ఏళ్లుగా ఆ ఆలయంలోకి ఆడవాళ్లు ఎవరూ కూడా అడుగుపెట్టలేదు.. కానీ ఓ అమ్మాయి మాత్రం అక్కడికి వెళ్లి పూజలు చేసింది. దాంతో ఆలయ సిబ్బంది మీద వేటు వెయ్యడంతో పాటుగా.. ఆలయాన్ని శుద్ది చేసి పూజలు నిర్వహించారు. అదేంటి మహిళ ప్రవేశిస్తే అంతలా హడావిడి చెయ్యాలా అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.
కొన్ని ఆలయాలు మినహాయిస్తే.. అన్ని ఆలయాల్లోకి మహిళలే ఎక్కువగా వెళ్తుంటారు. ఆ కొన్నింటిలో శని ఆలయం ఒకటి. కొన్ని చోట్ల శని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. అయితే మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలోని శని శిష్నాపూర్ ఉన్న శని ఆలయంలోకి మహిళ ప్రవేశించి పూజలు చేసింది. మహిళ శని ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేసినందుకు గానూ ఆలయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతే కాదు ఏడుగురు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఇక ఆచారాల ప్రకారం ఆలయాన్ని శుద్ధి చేసి పాలతో అభిషేకం చేశారు. అయితే ఆలయ కమిటీ తీరుపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు మండిపడుతున్నాయి. శని ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more