రెండేళ్ల చిన్నారి.. ముద్దులోలికే మాటలు వింటే ఆవి విన్నవారికి ఎంత మాట్లాడినా వినాలనే వుంటుంది. ఇక తల్లిదండ్రులకు ఆ ముద్దులోలికే చిన్నారి నోటి నుంచి జాలు వారిన పద్యాలు, గేయాలు వింటే వాటిని రికార్డు చేసిన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి మరి సంబరపడుతుంటారు. మా చిన్నారి ఇవాళ ఇలా చేసింది, ఆ పాట పాడింది అని సంబరపడే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుతుంది. అంతేకాదు వాళ్ల సమీప బంధువులు కూడా చిన్నారులతో సరదాగా గడిపిని క్షణాలను సోషల్ మీడియాలో పెట్టి మరీ వాటిని చూస్తూ ఆనందిస్తారు.
అయితే ఈ చిన్నారి తండ్రి సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినా.. అందరిలా కాకుండా తన చిన్నారిని ప్రత్యేకంగా తయారు చేశారు. రెండేళ్ల ప్రాయంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించేలా తీర్చిదిద్దాడు. అందుకు అతని భాగస్వామి కృషి కూడా అమోఘం. ఇంతకీ వారు చిన్నారిని ఎలా తీర్చిదిద్దారో తెలుసా..? ఒక్క నిమిషంలో పది భగవద్గీత శ్లోకాలు చెప్పేలా. చాలా మంది పెద్దలకు కూడా అసాధ్యమైనదే అయినా చిన్న ప్రాయంలోనే అలా చిన్నారిలో శ్లోకాల పఠనం చేయించడంలో వారి శ్రమ, ఓర్పు అభినందించాల్సిందే.
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్కు చెందిన సాయిని సంతోష్-అనూష దంపతుల కుమార్తె సహస్ర ఇలా ఒక్క నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చెప్పి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోచోటు దక్కిందించుకుంది. తండ్రి సంతోష్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండటంతో హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో కుటుంబం తాత్కలిక నివాసం ఏర్పచ్చుకున్నారు. స్థానిక క్యూట్ ఎలాండ్ స్కూల్లో నర్సరీ చదువుతున్న సహస్ర... గత నెల 14న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఏర్పాటు చేసిన పోటీల్లో ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివి అబ్బురపరిచింది. గతంలో ఒక నిమిషంలో ఎనిమిది శ్లోకాలు చదివిన రికార్డులను అధిగమించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more