హ్యాట్రిక్ వీరుడిగా పేరుగాంచి, ముచ్చటగా నాల్గవసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తన సీఎం ప్రమాణకార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానిస్తూ నితిష్ కుమార్ ప్రధాని మోదీకి సందేశం పంపించడంతో.. ముందుగా ఫిక్స్ చేసిన కార్యక్రమాల వల్ల మోదీ కార్యక్రమానికి రాలేకపోవచ్చని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఇవాళ స్వయంగా నితీశ్ మోదీకి ఫోన్ చేశారని, ఈ నెల 20న పాట్నాలోని గాంధీ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారని బీహార్ సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల ఛత్ వేడుక ముగియడంతో ఈ ఉదయం పలువురు ప్రముఖులకు నితీశే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని చెప్పారు. అయితే, ప్రధానికి బదులుగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడి ప్రమాణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిసింది.
కాగా, ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీయే సభ్యులు హాజరుకానున్నట్లు తెలిసింది. పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్ బీర్ బాదల్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేల తరుపున సుభాష్ దేశాయ్, రామ్ దాస్ కడం కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరోపక్క, ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more