సిరియాలోని ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్, రష్యా విరుచుకుపడుతున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాలతో దాడులు చేశాయి. పారిస్లో ఉగ్రవాదుల మారణకాండకు 129 మంది బలయ్యారు. దీనికి ప్రతీకారంగా ఉత్తర సిరియాలోని ఐఎస్ శిక్షణ స్థావరాలపై దాడులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై పోరాటంలో తమకు సహకరించాలని అమెరికా, రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ను కోరారు. 26 ఈయూ దేశాలు తమ సమ్మతి తెలిపాయి. దాడులకు సహకరించాలని బ్రిటన్ భావిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ అభ్యర్థనకు రష్యా వెంటనే స్పందించింది. సిరియాలోని ఐఎస్ కీలక స్థావరాలపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఇటీవల ఈజిప్టులోని సినాయ్ ద్వీప కల్పంలో తమ విమానం కూలడానికి ఉగ్రవాదులు పెట్టిన బాంబే కారణమని రష్యా నిర్థారించింది. ఐఎస్పై ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షడు పుతిన్ ప్రకటించారు. 224 మంది ప్రయాణికుల మృతికి కారణమైన వారి సమాచారం అందించిన వారికి 50 మిలియన్ డాలర్ల బహుమానం ఇస్తామని రష్యా ప్రకటించింది.
పారిస్పై ఉగ్రదాడికి తగిన విధంగా బుద్ధిచెప్పాలని పంతంతో ఉన్న ఫ్రాన్స్.. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) స్థావరాలపై ముప్పేట విరుచుకుపడుతోంది. దాడులను మరింత ఉధృతం చేసే క్రమంలో ఛార్లెస్ డె గాలె యుద్ధ నౌక ద్వారా ఎయిర్క్రాఫ్ట్లను రంగంలోకి దింపినట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ వెల్లడించారు. యూఏఈ, జోర్డాన్ల మీదుగా ఇప్పటికే ప్రయోగించిన 12 యుద్ధ విమానాలు ఐఎస్ స్థావరాలపై భీకరంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మొత్తం 38 ఫైటర్ జెట్లను ప్రయోగించే అవకాశముందని, ఫలితంగా సిరియాలోని ఐఎస్ లక్ష్యాలపై గురితప్పని రీతిలో విజయం సాధించవచ్చని అధ్యక్షుడు తెలిపారు. రానున్న కొన్ని వారాల పాటు తమ దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. కాగా ఉత్తర సిరియాలో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న రాజధాని రక్కాపై అమెరికా సాయంతో తాజాగా జరిపిన దాడుల్లో కమాండ్ కేంద్రం, శిక్షణ కేంద్రాలు సహా ఐఎస్కు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసినట్టు ఫ్రాన్స్ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more