మహిళలపై తరచూ జరుగుతున్న అత్యాచార ఘటనల్ని తగ్గించేలా చర్యలు తీసుకోకుండా కొందరు రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో మరో హోంమంత్రి చేరిపోయారు. ఓ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి పరారైన నిందితుల ఆచూకీ కనుగొని, వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ‘అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు వేచి వుందో’నంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున టెన్నిస్ క్లబ్ వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు 34 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటినుంచి నిందితుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి అందరూ షాక్ కు గురయ్యేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఘటన చాలా దురదృష్టకరం. తుముకూరుకు చెందిన ఓ మహిళ రాత్రి 9.30 గంటల సమయంలో టెన్నిస్ క్లబ్ వద్ద ఉంది. ఆమె టెన్నిస్ నేర్చుకోవాలని అక్కడికి వెళ్లిందన్నారు. కానీ, అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు వేచి ఉందన్నదే అసలు ప్రశ్న. మేం అన్ని విషయాల మీద దర్యాప్తు చేస్తున్నాం’ అని హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. హోంమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మండిపడ్డారు. పరమేశ్వర వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడం మొదటిసారి కాదని, దీనివల్ల ప్రజల్లోకి సరైన సందేశం వెళ్లదని ఆమె చెప్పారు. ఆయనకు తన పనిమీద ఆసక్తి లేకపోతే వెంటనే దిగిపోవాలని అన్నారు.
ఇదిలావుండగా.. గత నెలలో 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పటి హోంమంత్రి కేజే జార్జి కూడా దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇద్దరే చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎందుకు అవుతుందని, కనీసం ముగ్గరు నలుగురు చేస్తే కదా.. అనాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ విధంగా అలా వ్యాఖ్యానించడంతో కొన్నాళ్ల తర్వాత ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ పరమేశ్వరను నియమించారు. ఇప్పుడీయన కూడా ఇలా కామెంట్ చేయడంతో పార్టీ పెద్దలు ఆందోళనలో పడిపోయినట్లు సమాచారం.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more