సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించే కర్తవ్యం పార్టీ కార్యకర్తలదేనని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతిలో టీడీపీ పార్టీ సదస్సును అధినేత చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడకు వెళ్లినప్పుడు ఆఫీసు కూడా లేదని.. ఇప్పుడు అన్నీ సమకూర్చకుంటున్నామని.. అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించబోతున్నామని, విభజన హామీల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులను గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకువ చ్చి 2029 నాటికి దేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతానన్నారు.
Also Read: ఆ బుడ్డోడి వల్ల నారా లోకేష్ హ్యాపీ
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా నిలుస్తుందని.. కష్టపడి సపని చేసిన వారికి గుర్తింపు వస్తుందని కూడా చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కరవు నివారణకు నీరు చెట్టు కార్యక్రమాన్ని రూపొందించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జూన నాటికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు నీరు అందిస్తామన్నారు. రెండేళ్లలో గాలేరు- నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రాయలసీమకు సాగు నీరందిస్తే గోదావరి జిల్లాలకు పోటీగా పంటలు పండిస్తారని చంద్రబాబు టీడీపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సందర్భాల్లో కీలక సభలు, సమావేశాలకు తిరుపతినే వేదికవుతోంది. పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బాబు...ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే...టెంపుల్ సిటీ తిరుపతిలో మేథోమదనం నిర్వహిస్తోంది టీడీపీ.
Also Read: మోదీకి తర్వాత షాకిచ్చేది చంద్రబాబేనా...?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more