వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి కపిల్ మోహన్ నిజస్వరూపం బయటపడింది. ఆయనపై వెల్లువెత్తిన అరోపణల నేపథ్యంలో అతని ఇళ్లు, కార్యాలయంపై పై దాడి చేసిన సిఐడీ అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఆయన నివాసంలో చిన్నపిల్లల నీలిచిత్రాలు (చైల్డ్ పొనోగ్రఫీ) అలాగే పెద్దల నీలిచిత్రాల ( అడల్ట్ ఫోనోగ్రఫీ)తో కూడిన ఎనమిది సిడీలు, హార్డ్ డిస్క్ లభ్యమయ్యాయి. ఈ విషయమై బెంగళూరు యశ్వంతపుర పోలీస్ స్టేషన్లో గురువారం ఆయనపై ఐటీ యాక్ట్-67బీ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాలు... అనేక అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు కపిల్ మోహన్పై ఉన్నాయి.
Also Read : అత్యాచారం చేశాడని.. అలా ప్రతీకారం తీర్చుకుంది!
ఆయన నివసిస్తున్న గోల్డన్ గేట్ అపార్ట్మెంట్లోని ప్లాట్ (602) లో సీఐడీ, ఐటీ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 5న సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రూ.4.30 కోట్ల నగదు, వజ్రాభరణాలు వివిధ ఆస్తులకు సంబంధించిన దస్త్రాలతో పాటు 28 సీడీలు, ఒక హార్డ్ డిస్క్ను ఆ సమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసును లోకాయుక్తకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో సీఐడీ సోదాల్లో బయట పడిన దస్త్రాలు, సీడీలు, హార్డ్ డిస్క్లను లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా సీడీలను, హర్డ్ డిస్క్ను పరిశీలించగా 20 సీడీల్లో సాధారణ నీలిచిత్రాలు, ఒక సీడీలో చైల్డ్ ఫొనోగ్రఫీ ఉన్నట్లు లోకాయుక్త పోలీసులు గుర్తించారు. దీంతో ఈ విషయమై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్కు లోకాయుక్త సంస్థ ఏడీజీపీ ప్రేమ్కుమార్ మీన లేఖ రాసి ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరారు. దీంతో కమిషనర్ మేఘరిక్ సూచనల మేరకు కపిల్ మోహన్పై ఐటీ యాక్ట్-67( బీ)ను అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more