మోదీ రాజకీయ చాణిక్యం రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు తీసుకువస్తోంది. గో మాంసం, దేశంలో పెరుగుతున్న హింస లాంటి అంశాలతో మోదీని, మోదీ సర్కార్ ను బీహార్ ఎన్నికల్లో దెబ్బతీయాలని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గా:ధీ ప్లాన్ వేశారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఇదే ప్రచారాన్ని కూడా చేశారు. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత దేశంలో అసహనం, హింస పెరిగాయని కాంగ్రెస్ పార్టీ పదేపదే అంటోంది. అయితే ఎన్నికల టైంలో ఇలా మోదీని కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోదీ గట్టిగా ఎదుర్కున్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలో సిక్కుల ఊచకోత కోసిన మీరా.. మాకు చెప్పేది అంటూ మోదీ కాంగ్రెస్ ను సందిగ్దంలో పడేశారు.
రాహుల్ గాంధీ ఫరీద్ కోట్ పర్యటనపై శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా స్పందించింది. పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు రాహుల్ ఈ పర్యటన పెట్టుకున్నారు. దీంతో 1984 సిక్కుల ఊచకోత సందర్భంగా మరణించిన సిక్కుల కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబాన్ని అయినా.. ఎప్పుడైనా రాహుల్ గాంధీ కలుసుకున్నాడా అని నిలదీసింది. ఆనాడు 2,500 మందికి పైగా సిక్కులు బలైతే.. పలకరించని రాహుల్ ఇప్పుడు ఇద్దరు పోలీసు కాల్పుల్లో చనిపోతే ఫరీద్ కోట్ లో రాజకీయం చేయడానికి వస్తున్నాడని శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ ప్రెసిడెంట్ మంజిత్ సింగ్ జికే. నిలదీశారు. 1984 లో ఊచకోతలో చనిపోయిన కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని అయినా ఎందుకు పరామర్శించలేక పోయారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఫరీద్ కోట్ ఎంతో దూరం అనీ.. తన ఇంటికి అతి సమీపంలోని ఢిల్లీ తిలక్ నగర్ లో వితంతువుల కాలనీని ఎందుకు వెళ్లలేకపోయారని మంజిత్ సింగ్ తీవ్రంగా ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more