ముంబై వరుస పేలుళ్ల ప్రధాన నిందితుడు, ముంబై అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ లో మరింత సెక్యూరిటీ కల్పించింది అక్కడి ప్రభుత్వం. భారతదేశం టాప్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న దావూద్ కు పాక్ ప్రభుత్వం మరింత సెక్యూరిటీ పెంచింది. బాలిలో ఛోటా రాజన్ అరెస్టుతో పాకిస్థాన్ లో దావూద్ కు మరింత సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ ఇంటికి ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దావూద్ ను కూడా భారత్ కు రప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో పాక్ ప్రభుత్వం అలర్ట్ అయింది.
దావూద్ ఇబ్రహీం 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత దేశం వదిలిపారిపోయాడు. అయితే ముందుగా దుబాయ్ లాంటి దేశంలో ఉన్నాడు అని అందరూ అనుకున్నా కానీ పాకిస్థాన్ లోనే తలదాచుకున్నట్లు భారత ఇంటలిజెన్స్ కనిపెట్టింది. అయితే భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు కు పాకిస్థాన్ ఫుల్ సెక్యురిటీ కల్పిస్తోంది. ముంబై పేలుళ్లలో దాదాపు 257 మంది అమాయకుల చావుకు దావూద్ కారణమయ్యాడు. దాంతో పాటుగా మనీ లాండరింగ్, పలు మర్డర్ కేసుల్లో కూడా దావూద్ నిందితుడిగా ఉన్నాడు. అయితే తాజాగా ఛోటా రాజన్ అరెస్టు తర్వాత దావూద్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దావూద్ ను ఖచ్చితంగా భారత్ కు రప్పిస్తామని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చెయ్యడం.. పాకిస్థాన్ లో దావూద్ ఉన్నట్లు భారత్ పక్కా సమాచారంతో పాక్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే దావూద్ కు ఐఎస్ఐ భద్రతా బృందం చేత రక్షణ కల్పిస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more