అసలే కొత్త రాష్ట్రం కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పడిన రాష్ట్రం. లోటె బడ్జెట్. ఆదాయ వనరులు మాత్రం కనిపించడం లేదు.. రాజధాని నిర్మాణానికి భారీ ఖర్చు ఉంది.. ఇది ఏపి ప్రభుత్వం ముందున్న కష్టాల లిస్ట్. అయితే ఏపి ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం సిఎం చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారింది. హైదరాబాద్ లో ఉద్యోగులు, ఏపిలో చంద్రబాబు ఉంటే పాలన సజావుగా ఎలా సాగుతుందని బాబు హాట్ హాట్ గా ఉన్నారు. అందుకే జూన్ 2వ తేదీలోగా ఉద్యోగులంతా విజయవాడకు రావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలా వచ్చిన వారి పిల్లలకు స్థానికత వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ భేటీలో ఉద్యోగుల తరలింపు, కాపులను బీసీల్లో చేర్చే అంశం, రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలు చర్చకు వచ్చాయి.
ప్రభుత్వ ఉద్యోగులంతా వచ్చే ఏడాది జూన్ రెండు నాటికి విజయవాడకు రావాల్సిందేనని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలా వచ్చిన వారి పిల్లలకు స్థానికత వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండకూడదని కూడా కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం డిసైడ్ అయింది. ఉద్యోగులకు సంబంధించి మేధా టవర్ లో నాలుగు శాఖలు ఏర్పాటు చేయాలని, రెయిన్ట్రీ పార్కులో గృహ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరులో మున్సిపల్, వ్యవసాయశాఖ కార్యాలయాలు వారంలోగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఫ్రభుత్వ ఉద్యోగులకు గతంలో హైదరాబాద్ లో కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు 60 కోట్లు రూపాయలు కేటాయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more