ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మంది మంత్రులను మంత్రి పదవుల నుండి తొలగించారు. నిన్నటి దాకా మెతక వైఖరి అవలంభిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సిఎం ఏకంగా ఎనిమిది మంది మంత్రులను తొలగించడం సంచలనం రేపుతోంది. యంగ్ సిఎంగా బారీ క్రేజ్ ను సంపాదించిన ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మీద గత కొంత కాలంగా వస్తున్న విమర్శలు అఖిలేష్ ను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టేసింది. అయితే మరి ఏం ఆలోచించి ఇలా ఏకంగా ఎనిమిది మంది మంత్రులను పదవుల నుండి ఉద్వాసన పలికారో అంటూ యుపి జనాలు గుసగుసలాడుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు.. ఇప్పుడికి చాలా మార్పులు వచ్చాయి. పరిపాలన వ్యవస్థ మీద పట్టులేదని.. గట్టిగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, సత్తా అఖిలేష్ కు లేదు అని విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఐదుగురు కేబినెట్ మంత్రులను, ఇద్దరు సహాయ మంత్రులను తొలగిస్తూ అఖిలేష్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో అఖిలేఫ్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం యాదవ్ కూడా అఖిలేష్ మీద విమర్శలు గుప్పించారు. బహిరంగ సభలో అందరి ముందు అఖిలేష్ మీద విరుచుకు పడ్డారు. దాంతో కఠిన నిర్ణయానికి వెనక్కి తగ్గడు అన్నట్లుగా తాజాగా అఖిలేష్ ఎనిమిది మంది మంత్రులకు గుడ్ బై చెప్పారు. అయితే 2017 ఎన్నికల్లోపు తిరిగి పార్టీని పటిష్టం చెయ్యాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని కూడా ఓ వాదన వినిపిస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more