తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద తీవ్రంగా మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రభుత్వం మీద కత్తులు దూస్తున్నాయి. టిడిపి, బిజెపి పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెతున్న తరుణంలో వరంగల్ ఎన్నికల మీద అప్పుడే కిషన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు నామినేషన్లకు ఎన్నికల కమీషన్ గడువు విధించింది. ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందరూ గట్టిగా బుద్ది చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెబుతోందని. కానీ ఆచరణలో మాత్రం ఏమీ చెయ్యడం లేదని విమర్శించారు.
వరంగల్ ఉప ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. నువ్వా నేనా అన్నట్లు రసవత్తరంగా సాగనున్న వరంగల్ పోరులో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల గెలుపుకు అప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఖచ్చతంగా ట్రీట్ మెంట్ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. రైతుల ఆత్మహత్యలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది మండిపడ్డారు. అలాగే బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన కేసీఆర్ కేవలం తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న కేసీఆర్ తన హామీలను నిలబెట్టుకోలేదని కిషన్ రెడ్డి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more