ఆంధ్రుల నవ రాజధాని అమరావతి శంకుస్థాపన ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. దేశ, విదేశ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏదో ప్యాకేజీనో లేదంటే ప్రత్యేక హోదా మీద మోదీ ప్రకటిస్తారని అందరూ ఆశతో వచ్చారు. కానీ మోదీ మాత్రం ప్రత్యేక హోదా ఊసెత్తకుండా.. తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో విపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి. ఇటు బాబు, అటు మోడీని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. అమరావతి శంకుస్థాపన వేదికపై నుంచి ప్రధాని మోడీ ప్రత్యేకహోదా ప్రకటన చేస్తారని, లేదంటే ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేస్తారని చాలా మంది భావించారు. కానీ అలా జరగకపోయేసరికి విపక్ష నేతలు నోటికి పదునుపెట్టారు. అదే సమయంలో ఆందోళనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు, మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాను బాబు అమ్మేశారని ఆరోపించిన జగన్...మోడీని వదల్లేదు. మట్టి, నీళ్లు తెచ్చిన మోడీ.. హోదాపై ప్రకటన చేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఈ క్రమంలోనే నేడు ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల ఆవేదన మోడీకి, బాబుకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. 5కోట్ల మంది ఆంధ్రుల ఆశలను నట్టేట ముంచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో..ఏపీ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఫైర్ అవుతున్నాయి. మోడీ తీరుకి నిరసనగా…ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలు తగులబెట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన రఘువీరా రెడ్డి.. మోడీ వస్తారని, ప్రత్యేకహోదాపై ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తే..ప్రధాని మాటలతో మోసం చేశారని ఆయన ఆరోపించారు. ప్రధాని తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, అందుకు ప్రతిగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని రఘువీరా పిలుపునిచ్చారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ..స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more