‘బజరంగీ భాయిజాన్’ సినిమాలాగే పాకిస్థాన్ లోని గీత కథ గురించి అందరికీ తెలిసిందే! ఇండియాకు చెందిన గీత చిన్నప్పుడు తప్పిపోయి పాకిస్థాన్ లోకి ఎంట్రీ అవ్వగా.. అక్కడ ఓ కుటుంబం ఆమెను చేరదీసుకొని పోషించారు. 14 సంవత్సరాలపాటు అక్కడే వున్న గీత కథ ‘బజరంగీ భాయిజాన్’ సినిమా తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో 14 ఏళ్లు అజ్ఞాత వాసంలో వున్న ఆమె కథ సుఖాంతం అవుతుందనుకున్న తరుణంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది.
గీతకు సంబంధించిన నిజమైన కుటుంబసభ్యులు ఎవరో సంప్రదిస్తే ఆమెను తిరిగి పంపిస్తామని ఆమెను పోషించిన పాకిస్థాన్ కుటుంబం చెప్పిన నేపథ్యంలో.. ఇండియా నుంచి కొన్ని కుటుంబాలు స్పందించాయి. దీంతో తికమక చెందిన భారత ప్రభుత్వం.. బాగా విచారించిన తర్వాత గీత కుటుంబసభ్యులెవరో కనుగొనగలిగారు. బీహార్ లో వుండే ఓ కుటుంబం గీత తమ కూతురేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గీతను బిహార్లోని ఆమె కుటుంబ సభ్యులతో స్కైప్ (వీడియో కాలింగ్)లో మాట్లాడిస్తే.. వారిని చూసి వీళ్లే కుటుంబ సభ్యులేనని గుర్తించింది కూడా! దాంతో ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో గీత కథ ఓ కొలిక్కి వచ్చిందన్న నేపథ్యంలోనే ఒక ట్విస్ట్ వచ్చి పడింది.
గీతకు మైనర్గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తనకు అసలు పెళ్లి కాలేదని గీత అంటోంది. దీనికి తోడు తప్పిపోకముందు దిగిన ఓ బాలిక ఫొటోను చూపించినా.. అది తనది కాదని గీత స్పష్టం చేసింది. ఈ తరుణంలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయని.. ఈది ఫౌండేషన్ నిర్వాహకుడు ఫైజల్ ఈది తెలిపారు. గీత తమదగ్గర ఏమైనా దాస్తోందా లేక.. తప్పుదారి పట్టిస్తోందా అనే విషయాలు ఆమెతో మాట్లాడాకే నిర్ధారిస్తామన్నారు. అటు గీత కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాకే అప్పగిస్తారని.. పాకిస్తాన్లో భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్ తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more