ఉమ్మడి రాష్ట్రం విడిపోయా రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. తెలంగాణ, ఏపిలు విడివిడిగా పరిపాలనను ప్రారంభించాయి. అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఎంతో కాలంగా ఉంటున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు ఇక్కడే సెటిల్ అయ్యారు. అయితే ఏపి మూలాలున్న వాళ్ల పిల్లలు ఎంతో మంది తెలంగాణలో చదువుకుంటున్నారు. ఏపిలో తెలంగాణ విద్యార్థుల సంఖ్య కన్నా తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో చదువుతున్న ఏపి విద్యార్థులకు ఫీజులను కట్టడానికి నిరాకరించింది. ఏపి విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్ షిప్ లు నిలిపివేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నేటివిటి ఆధారంగా కేవలం తెలంగాణ వారికి మాత్రమే స్కాలర్ షిప అందేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంది. అయితే తెలంగాణలో ఉంటున్న ఏపి విద్యార్థులకు భరోసా కల్పిస్తూ.. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. దాదాపు 24, 540 మంది ఏపి విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపే ఏపి ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలుసా.?
ఏపి, తెలంగాణ రాష్ట్రాలు కేవలం తమ విద్యార్థులకు మాత్రమే స్కాలర్ షిప్ లు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో చాలా మంది ఏపి విద్యార్థులు నష్టపోతున్నారు. తెలంగాణలో ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వాళ్లు స్కాలర్ షిప్ లు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే తాజాగా ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో చదువుతున్న ఏపికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్ షిప్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని.. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. ఏపి విద్యార్థులకు మోరల్ సపోర్ట్ కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 24, 540 మంది ఏపి విద్యార్థులు చదువుతుండగా... ఏపిలో 3,200 మంది తెలంగాణ విద్యార్థులు చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం మీద ఏపి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more