గుజరాత్లో పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ కావాలని తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న యువ ఉద్యమ కెరటం, పటేల్ అనామత్ అందోళన్ అధినేత హార్ధిక్ పటేల్ బీజేపి జాతీయ అద్యక్షుడు అమిత్ షాకు సవాల్ విసిరారు. ధైర్యముంటే తమ బలగాలతో కాల్చి చంపండీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అమిత్ షా అవసరం అయితే మీ బలగాలతో దాడులు చేయించుకోండి.. చంపించుకోండి.. నేను పోతే నాలాంటివాళ్లు చాలామంది వస్తారు.. నేను బతికున్నంత వరకు పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ సాధన ఉద్యమం మాత్రం ఆగదు' అని ఆయన తేల్చి చెప్పారు. అమిత్ షా ఏమి కావాలంటే అది చేసుకునే అవకాశం ఆయనకు వుందని అయితే ఆయన దయచేసి తమ ఉద్యమంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని కోరారు. పటేళ్ల ఉద్యమం ఆపేయాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో హార్థిక్ పటేల్ చాలా తీవ్రంగా స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు చెప్పినంత మాత్రాన తాము ఇన్నాళ్లుగా చేపట్టిన ఉద్యమం ఆపేయాలా అని ప్రశ్నించారు. 'పటేళ్లకు రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి దూరంగా ఉండమని తాను అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మీరు కోరినంత మాత్రానా మా ఉద్యమం ఆగదు. తాను బ్రతికున్నంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపబోమని... బలగాలతో మమ్మల్ని అణిచివేయాలని చూస్తే అదీ చేసుకోండి. అవసరం అయితే తనను చంపేసుకోండంటూ వ్యాఖ్యానించారు. నన్ను చంపినంత మాత్రన ఈ ఉద్యమం ఆగదని, తనలాంటి ఎందరో హార్ధిక్ పటేళ్లు పుట్టివస్తారన్నారు. తమ డిమాండ్లు స్వీకరించేందుకు ప్రయత్నించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అమిత్ షాను కోరారు.
తామేం హరెన్ పాండ్యా, అమిత్ జెత్వా, సంజయ్ జోషిలం కాదని చెప్పారు. అమిత్ షా ఎలా పనిచేస్తారో తమకు తెలుసని, అందుకే తమకు ధర్నాలు, నిరసనలు, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. అవసరం అయితే, బలగాల సాయంతో తమ ఉద్యమాన్ని తుదముట్టించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం ముందే గ్రహించిన తాము ఆయన దయచేసి ఈ ఉద్యమంలో జోక్యం చేసుకోవద్దని అమిత్ షాకు బహిరంగంగా మీడియా ద్వారా సూచిస్తున్నామని హార్థిక్ పటేల్ చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more