తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ పార్టీ అధికారంలో వుంది కదా అని అధికారులపై ప్రతాపాన్ని చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నామధ్య వరంగల్ జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అధికారులపై దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. ఆ వివాదం ఇంకా చల్లారకముందే మరో ఎమ్మెల్యే దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆదిలాబాదు జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వయంగా ఇరిగేషన్ ఇంజినీర్ ను కొట్టారు. మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ.. సాగునీటి పారుదల శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) వీరేందర్ ను ఆ ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించి బూతు పురాణం అందుకున్నారట. అంతేకాదు.. ఆయన ఇంజినీర్ కాలర్ పట్టుకుని లాగి చెంపమీద కొట్టడంతోపాటు గోడకేసి కొట్టారట.
వరంగల్ జిల్లాలోని నెన్నెల మండలంలో మిషన్ కాకతీయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులను వీరేందర్ అనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ మిషన్ పనుల్లో భాగంగా బిల్లులను త్వరగా మంజూరు చేయాల్సిందిగా వీరేందర్ పై ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారట. కానీ.. ఆయన ఆయా బిల్లులను మంజూరు చేయడంలో కాస్త ఆలస్యం చేశారట. ఈ క్రమంలో ఎమ్మెల్యే చిన్నయ్య పీఏ భీమా గౌడ్ మంగళవారం వీరేందర్ కు ఫోన్ చేసి.. ‘సార్ రమ్మంటున్నారు’ అని చెప్పారట. ఇదే విషయాన్ని వీరేందర్ తన పై అధికారులకు చెబితే... ‘వెళ్తు... అక్కడ నీకు అసలు విషయం తెలుస్తుంది’ అని పరోక్షంగా ఎమ్మెల్యే ఆగ్రహాన్ని తెలిపారట. చేసేదేమీ లేక మంచిర్యాలలోని ఎమ్మెల్యే ఇంటికి వీరేందర్ వెళ్లారు. తన ఇంటి లోపలికి అడుగు పెట్టీ పెట్టకముందే వీరేందర్ పై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారట. బిల్లులు ఎందుకు మంజూరు చేయడం లేదని నిలదీస్తూనే చొక్కా పట్టుకుని లాగి చెంపమీద కొట్టారు. అంతేకాదు.. వీరేందర్ ను గోడకేసి మరీ కొట్టారట.
ఎందుకు కొడుతున్నారని వీరేందర్ ఆ ఎమ్మెల్యేని అడిగితే.. ఆయన బూతు పురాటం అందుకున్నారట. తనపై జరిగిన దాడితో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ ఇంజనీర్.. ఈ ఘటన గురించి తన పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని లోకల్ మీడియా ముందు వాపోయారు. ఈ ఘటనపై ఇంజినీర్ల అసోసియేషన్ ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటన తెలంగాణలో ఎంత దుమారం రేపుతుందోనని రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more