తెలంగాణ సిఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మీద కీలక సదస్సు నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఎప్పుడు చేపట్టాలి.. నియోజక వర్గానికి ఎన్ని ఇళ్లు కేటాయించాలి.. గ్రామాల్లో ఎన్ని.. పట్టణాల్లో ఎన్ని.. ఎవరు దీన్ని సూపర్ వైజ్ చేస్తారు ఇలా అనేక విషయాల మీద కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు మొత్తం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి సూపర్ వైజ్ చేస్తారని.. వాటిని సూపర్ చెక్ చెయ్యాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వచ్చినట్లు అవినీతి ఆరోపణలకు ఎలాంటి తావు లేకుండా చూడాలని అన్నారు. ఒకవేళ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా వదిలేదని కూడా కేసీఆర్ హెచ్చరించారు. గతంలో నిర్మించిన ఇళ్లు ప్రస్తుత అవసరాలకు అస్సలు సరిపోవడం లేదని.. వాటి కన్నా చాలా బెటర్ గా కొత్త డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. ఈ ఏడాది 60 వేల ఇళ్లను నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా అసలు ఇళ్ల కేటాయింపు ఎలా జరుగుతుంది అన్నదే కీలకం. అయితే కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లలో సగం ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే, మిగతా సగం ఇళ్లను స్థానిక మంత్రి కేటాయిస్తారని వెల్లడించారు. ప్రతి నియోజక వర్గానికి 400 ఇళ్లను కేటాయిస్తున్నట్లు కూడా కేసీఆర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 36 వేల ఇళ్లు, పట్టణాల్లో 24 వేల ఇళ్లను కేటాయిస్తూ మొత్తంగా ఈ ఏడాది 60 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేసీఆర్ తెలిపారు. అయితే కేసీఆర్ ప్రకటన మీద అప్పుడే ప్రతిపక్ష నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇళ్లను కేటాయించే అధికారం ఇష్తే వాళ్లకు పనికి వచ్చే వాళ్లకు, పార్టీ కార్యకర్తలకు ఇళ్లను కేటాయించరా అని వారు అనుకుంటున్నారు. అది కూడా నిజమే మరి దీని మీద కేసీఆర్ ఎందుకు దృష్టిపెట్టలేదో.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more