విద్యార్థినీ విద్యార్థులకు సద్గుణాలను నేర్పించి.. వారిని రేపటి తరం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు.. కేవలం ధనార్జనే లక్ష్యంగా చేసుకుని పాఠశాలలను నడుపుతూ.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యంతో వ్యవహరిస్తూ.. విద్యార్థులను క్రమశిక్షణ కల్గిన పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని బడాయిలు చెప్పుకుంటారు. విద్యార్థుల తల్లదండ్రలు నుంచి భారెడు ఫీజులను గుంజే పాఠశాలలు.. కనీసం విద్యార్థులకు మూరెడు సేవలను కూడా అందించడంలో విఫలమవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ పశ్చిమగోదావరి జిల్లాలోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూల్.
జిల్లాలోని ఏలూరు సమీపంలోని వెంకటాపురం పంచాయతీ బగ్గయ్యవారిపేటలోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో మూడేళ్ల చిన్నారిపై ఆయాలు కర్కశత్వంగా వ్యవహరించారు. స్కూల్లో యూరిన్ పోసిందని ఆరోపిస్తూ ఎల్కేజీ విద్యార్థి జ్వాలశ్రీని ఆయాలు మండుటెండలో ఆట స్థలంలోని జారుడు బల్లపై కుర్చోబెట్టారు. అయితే ఆయాలు ఇలా తమ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఉపాధ్యాయులు కానీ, పాఠశాల యాజమాన్యం కానీ వారి చర్యలను అడ్డుకున్న దాఖలాలు లేవు. వేల రూపాయలు ఫీజలు తీసుకుని.. వాటి నుంచి జీతబెత్యాలు తీసుకుంటున్నామన్న కనీస ఇంకితజ్ఞానం కూడా లేకుండా ఆయాలు చిన్నారిని ఎండలో నిల్చోబెట్టారు.
తమకు ఉపాధి కల్పించింది విద్యార్థుల బాగోగులు చూసేందుకేనన్న ప్రధమ బాధ్యతను మర్చి.. ఇలా దారుణంగా శిక్షించారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. సాయంత్రం ఇంటికి వెళ్లిన జ్వాలశ్రీని అనారోగ్యం పాలైంది. దీంతో ఏమైందని ప్రశ్నించడంతో జ్వాలశ్రీ స్కూల్లో జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన వారు... మంగళవారం ఉదయం స్కూల్కు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పాప అస్వస్థతకు, తమకు ఎటువంటి సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన జ్వాలశ్రీ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more