పాక్ మాజీ విదేశాంగ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం జరుగనుంది. అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ నేతృత్వంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. మరోవైపు ఈ కార్యక్రమంపై శివసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ నిర్వాహకులు పుస్తకావిష్కరణకు సిద్ధమయ్యారు. ఇందుకు నిరసనగా ఓఆర్ఎఫ్ ఛైర్మన్ సుదీంద్ర కులకర్ణి ముఖానికి శివసేన కార్యకర్తలు సిరా పూశారు. పాకిస్థాన్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి చేశారు. ఇంక్ మరకలతోనే కులకర్ణి ప్రెస్మీట్ పెట్టారు. పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని శివసేన బెదిరిస్తున్నది... శివసేన బెదిరింపులకు భయపడేది లేదు... సాయంత్రం 5.30 గంటలకు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగి తీరుతుందని కులకర్ణి తేల్చిచెప్పారు. కులకర్ణిపై ఇంక్ దాడి దురదృష్టకరమని పాక్ మాజీ మంత్రి కసూరి పేర్కొన్నారు.
పాకిస్థాన్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి చేసిన విషయం విదితమే. కులకర్ణిపై ఇంకు దాడిని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఖండించారు. ఇంకు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇలాంటి ఘటనలతో దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో భిన్నమైన అభిప్రాయాలకు అవకాశం ఉండాలి. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. కాగా శివసేన నాయకులు దీన్ని సమర్థిస్తున్నారు. పాకిస్థాన్ రాసిన మన సౌనికుల రక్తపు మరకలు కనిపించడం లేదు కానీ.. ఓ వ్యక్తి మీద వేసిన సిరా మరకలు కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more